సికింద్రాబాద్ : కొత్త రైల్వే టైమ్ టైబుల్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్
మేనేజర్ ఆస్తాన శనివారం విడుదల చేశారు. విడుదల చేసిన కొత్త టైమ్ టైబుల్
ఆదివారం నుంచి అమలు అవుతుందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సమాచారంతో పాటు
సౌత్ సెంట్రల్ రైల్వే, వెస్టన్ రైల్వే, కొంకణ్ రైల్వేకు సంబంధించిన
సమాచారాన్ని కూడా కొత్త టైమ్ టేబుల్ లో పొందుపరిచినట్లు ఆస్తాన
పేర్కొన్నారు.
బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 25 కొత్త రైళ్లు, 15 సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మిగిలిన పది రైళ్లు వయా సౌత్ సెంట్రల్ రైల్వే మీదగా ఈ ఏడాదిలో ప్రవేశపెడతామన్నారు. అలాగే 12 రైళ్లలో రేపటినుంచి స్వల్ప మార్పులతో పాటు 9 రైళ్ల నెంబర్లలో మార్పులు చేసినట్లు తెలిపారు. 2 రైళ్లకు పది నిమిషాల నుంచి 50 నిమిషాల వేగం పెంచినట్లు చెప్పారు.
Source: Sakshi Telugu News Paper online.
బడ్జెట్ లో ప్రకటించిన విధంగా 25 కొత్త రైళ్లు, 15 సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మిగిలిన పది రైళ్లు వయా సౌత్ సెంట్రల్ రైల్వే మీదగా ఈ ఏడాదిలో ప్రవేశపెడతామన్నారు. అలాగే 12 రైళ్లలో రేపటినుంచి స్వల్ప మార్పులతో పాటు 9 రైళ్ల నెంబర్లలో మార్పులు చేసినట్లు తెలిపారు. 2 రైళ్లకు పది నిమిషాల నుంచి 50 నిమిషాల వేగం పెంచినట్లు చెప్పారు.
Source: Sakshi Telugu News Paper online.